ప్రతిష్టాత్మకంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.ఇప్పటికే ఎన్నికలు పూర్తి అయ్యి చాలా కాలం అయినా కూడా కోర్టులో కేసు ఉండటం వల్ల అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి.
నేడు విచారణకు వచ్చిన మా అధ్యక్ష ఎన్నికల్లో కోట్లు తీర్పు ఇస్తుందని అంతా అనుకున్నారు.అయితే ఈ కేసును మరోసారి వాయిదా వేస్తున్నట్లుగా కోర్టు ప్రకటించింది.
ఇరు వర్గాల వాదోపవాదాలు విన్న కోర్టు కేసును ఇదే నెల 15వ తారీకుకు వాయిదా వేయడం జరిగింది.మరి ఆ రోజైన మా ఫలితాలపై స్పష్టత వస్తుందో లేదో చూడాలి.ఇప్పటికే ఎన్నికలు జరిగి చాలా రోజులు అయిన నేపథ్యంలో ఫలితాలను వాయిదా వేయడం మంచిది కాదని కోర్టుకు న్యాయమూర్తి తెలియజేసినట్లుగా సమాచారం అందుతోంది.15వ తారీకున దాదాపుగా ఫలితాలు వెళ్లడి అయ్యే అవకాశాలున్నాయి.అలా కాని పక్షంలో మరోసారి వాయిదా పడితే అభ్యర్థులు మరింతగా ఢీలా పడిపోతారు.రాజేంద్ర ప్రసాద్ మరియు జయసుధలు అధ్యక్ష భరిలో నిలిచి హోరా హోరీగా పోటీ పడ్డ విషయం తెల్సిందే.