మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
హత్య జరిగిన స్థలంలో లభించిన లేఖను 2021 ఫిబ్రవరి 11వ తేదీన సీబీఐ సీఎఫ్ఎస్ఎల్ కు పంపిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వివేక ఒత్తిడిలో రాసిన లేఖగా ఇప్పటికే ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ తేల్చింది.
లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ ను సీబీఐ కోరడంతో నిన్ హైడ్రిన్ పరీక్ష చేయాలని తెలిపింది.కాగా నిన్ హైడ్రిన్ పరీక్ష ద్వారా లేఖపై చేతి రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది.
నిన్ హైడ్రిన్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరగా న్యాయస్థానం అంగీకరించింది.