టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ప్రస్తుతం చికిత్స నిమిత్తం కొరియా వెళ్లిన విషయం తెలిసిందే.అక్కడ దాదాపు రెండు నుండి మూడు వారాల పాటు చికిత్స పొందబోతున్నట్లుగా తెలుస్తుంది.
సమంత నటించిన యశోద సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా లో తమ హాస్పిటల్ పేరు ను వాడారు అంటూ ఒక సంస్థ చిత్ర యూనిట్ సభ్యులపై కేసు వేయడం జరిగింది.
దాంతో సమంత కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే ఆమె అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఈ సమయం లో ఆమె కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం తో అంతా ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమయం లోనే సమంత మరియు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా కోర్టు నుండి క్లీన్ చీట్ పొందారు.
ఉదేశపూర్వకంగా ఎవరి పేరు ను వాడలేదని.హాస్పిట్ ని తప్పుడుగా చూపించలేదని.ఆ ఉద్దేశం లేనేలేదు అంటూ యశోద చిత్ర యూనిట్ సభ్యుల తరఫున లాయర్ వాదించడంతో కోర్టులో యశోద చిత్ర యూనిట్ సభ్యులు ఊరట పొందారట.సమంత కూడా ఈ వివాదం నుండి పూర్తిగా బయటపడ్డట్లే అంటూ ఆమె సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు.
ఇక యశోద తర్వాత సమంత నటించిన శకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.వచ్చే ఏడాది ఆరంభం లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ సమాచారం అందుతుంది.హిందీ లో కూడా ఈమె రెండు మూడు సినిమా లకు కమిట్ అయింది.సినిమా లు మాత్రమే కాకుండా సిరీస్ లను కూడా ఈమె చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కొరియా నుండి తిరిగి వచ్చిన వెంటనే విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఖుషి సినిమా షూట్ లో పాల్గొనబోతుందట.