ఇంట్లో చెప్పకుండా బయటకి వెళ్ళిపోయి ప్రేమ జంటలని చూసి ఉంటాం.లేచిపోయిన ప్రేమ జంటలు ఎక్కడో గుళ్లోనో లేదంటే రిజిస్టర్ ఆఫీస్ లోనో పెళ్లి చేసుకుంటారు.
ఇది ఎక్కడైనా జరిగేదే.బయటకి వెళ్లి పెళ్లిచేసుకోవడానికి సిద్ధమైన ప్రేమికులు ముందుగానే పక్కా ప్లాన్ తో సరంజామ సిద్ధం చేసుకొని వెళ్ళిపోతారు.
అయితే కొంత మంది ఎలాంటి ప్లాన్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు.అలంటి సమయంలో ఏ గుళ్ళోకి వెళ్లి పసుపు తాడుతో అమ్మాయి మెళ్ళో మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకుంటారు.
ఇదిలా ఉంటే ఇలా లేచి వెళ్ళిపోయినా ఓ ప్రేమ జంట కాస్తా విచిత్రంగా ఆలోచించారు.పసుపుతాడు అమ్మాయి మెళ్ళో కడితే ఏం బాగుంటుంది అని భావించి.
ఓ మహిళా మేడలో తాళిబొట్టు దొంగతనం చేశారు.అయితే వీరు చేసిన ఈ పని ఇప్పుడు వాళ్ళని పోలీసులకి పట్టించింది.
రమోహళ్లికి చెందిన హరీష్, భూమిక మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు.వీరి ప్రేమకి పెద్దలు ఒప్పుకోకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.ఆమె మెడలో పసుపు తాడు కడితే నలుగురిలో పలచనవుతానని భావించిన యువకుడు మంగళసూత్రం ఉన్న తాళి కట్టాలని తను ఫిక్సయ్యాడు.మంగళసూత్రం కొనడానికి సరిపడా డబ్బలు లేకపోవడంతో భాగా ఆలోచించి ఒక మహిళ మెడలో ఉన్న తాళి దొంగిలించాలని ఫిక్సయ్యారు.
ఇద్దరూ కలిసి అన్నంత పని చేశారు.నగరభవి ప్రాంతంలో ఓ మహిళ మెడలో ఉన్న తాళిని దొంగిలించారు.
మహిళను మాటల్లో దింపే పనిని యువతి చేస్తే.ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని దొంగిలించే పని ప్రియుడు పూర్తి చేశాడు.
అయితే తాళిబొట్టు దొంగిలించిన ఆ జంట అక్కడితో ఆగకుండా దానినే వృత్తిగా ఎంచుకున్నారు.దీంతో ఈ ప్రేమ జంటని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
దీంతో వారు దొంగతనాలు ఎందుకు, ఎలా మొదలెట్టింది పూసగుచ్చినట్లు పోలీసులకి చెప్పేశారు.ఇప్పుడు ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.