కరోనా వైరస్ ఎంత దారుణంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కోటి 80 లక్షలమందికి కరోనా వ్యాపించింది.ప్రపంచ ఆరోగ్య సంస్ద పరిశోధన బట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కరోనా వచ్చి పోతుందని సర్వేలు చెప్తున్నాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వచ్చి కొందరు మరణిస్తుంటే మరికొందరు కరోనా వస్తుందేమో అనే భయంతో మృతి చెందుతున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా భయంతో ఒక జంట ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన అనంతపురంలోని ధర్మవరంలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ధర్మవరం కు చెందిన దంపతులకు కరోనా వైరస్ సోకింది.దీంతో అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనా నుండి కోలుకున్నారు.
ఆస్పత్రి నుండి ఇంటికి చేరుకున్న వారికి మళ్లీ కరోనా వైరస్ వస్తుందేమో అని బయపడి ఇంటి భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
కాగా కరోనా వైరస్ సోకి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతిచెందారు.
అయితే దంపతుల ఆత్మహత్య సంఘటన స్థానికులను భయాందోళన కు గురి చేస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
కాగా ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.