అదృష్టం ఉంటే ఒక్క రోజు కూడా కష్టపడకుండా కోటేశ్వరులు అవ్వొచ్చు.లాటరీ ద్వారా గానీ లేదా గుప్తనిధి దొరకడం వల్ల చాలా మంది ఇప్పటికే అదృష్టవంతులు అయ్యారు.
అయితే తాజాగా ఇద్దరు దంపతులు కిచెన్ బాగు చేస్తుండగా వారికి వందలకొద్దీ పురాతన బంగారు నాణేలు దొరికాయి.వాటి విలువ ఇప్పుడు అక్షరాలు రూ.2.3 కోట్లు కావడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.వివరాల్లోకి వెళితే.ఇంగ్లాండ్లోని నార్త్ యార్క్షైర్లోని ఒక ఇంట్లో దంపతులు పదేళ్లుగా నివసిస్తున్నారు.అయితే ఆ ఇంటిలోని వంటగది బాగా పాడు కావడంతో దాన్ని బాగు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ క్రమంలోనే వంటగదిలోని ఫ్లోర్ తవ్వుతుండగా ఆరు అడుగుల లోతున వారికి ఒక మెటల్ వస్తువు కనిపించింది.
అందులో వారికి మిలమిలా మెరుస్తున్న కొన్ని కాయిన్స్ కనిపించాయి.ఏంటా అని ఇంకాస్త పరిశీలనగా చూడగా పురాతన బంగారు నాణేలు బయటపడ్డాయి.దాంతో వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ ఘటన 2019లో జరగగా ఇప్పుడు వాటిని వేలం వేస్తున్నారు.అలా త్వరలోనే కోట్లాధిపతులు కాబోతున్నారు.లండన్ ఆధారిత ఆక్షన్ కంపెనీ స్పింక్ అండ్ సన్ ఈ వేలం నిర్వహిస్తోంది.
కార్బన్ డేటింగ్ ప్రకారం, ఈ గోల్డ్ కాయిన్స్ 1610-1727 కాలం నాటివి.వీటిని ఒక పెద్ద వ్యాపారవేత్త అప్పటి కాలం లో దాచి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా ఆ దంపతులకు వరించిన లక్ గురించి విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.