పెళ్ళి మండపం సిద్ధంగా ఉంది.అతిథులంతా పెళ్ళికి వచ్చారు.
కొద్దీ సేపటిలో పెళ్లి జరగాల్సి ఉంది.కానీ అదే సమయంలో ఒక చిన్నారికి అత్యవసరంగా రక్తం అవసరమని తెలుసుకున్న ఆ నూతన వధూవరులు పెళ్లి బట్టలతోనే ఆసుపత్రికి వెళ్లి రక్తం ఇచ్చి ఆ చిన్నారి ప్రాణాలను రక్షించారు.
ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పెళ్లి బట్టలతో వధూవరులు దిగిన ఫోటోకు లైకులు, కామెంట్స్ తో నెటిజన్స్ మోతమోగిస్తున్నారు.
అన్ని దానాల కన్నా రక్త దానం చాలా గొప్పది.ఈ విషయాన్నీ ఒక పెళ్లి జంట నిరూపించారు.రక్తం సరైన సమయానికి అందకపోతే ఆ చిన్నారి ప్రాణాలతో ఉండదు అని తెలుసుకున్న ఆ వధూవరులు సమయానికి వచ్చి రక్తం అందించి ఆ చిన్నారిని ప్రాణాలతో రక్షించారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ పోలీస్ అధికారి ఆశిష్ కుమార్ మిశ్రా ఒక ఫోటోను షేర్ చేసారు.ఇప్పుడు ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది.ఆ ఫోటోలో నూతన వధూవరులు ఉన్నారు.వారిలో వరుడు రక్త దానం చేస్తుండగా వధువు పక్కనే నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేసారు.
ఆయన ఈ ఫోటో గురించి ట్వీట్ చేస్తూ.
నా భారత దేశం ఎంత గొప్పదో ఒక చిన్నారికి అత్యవసరంగా రక్తం కావాల్సి ఉండగా ఆ పాపకు రక్తం ఇచ్చేందుకు ఎవ్వరు ముందుకు రాలేదు.
ఎందుకంటే ఆ బిడ్డ వేరొకరి బిడ్డ కాబట్టి.కానీ ఈ జంట అలా అనుకోలేదు.రక్తదానం చేసి ఆ చిన్నారిని రక్షించారు’ అంటూ ఆయన ట్వీట్ చేసారు.ఈ ఫోటోను చుసిన నెటిజన్లు వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
పెళ్లి జరిగే సమయంలో కూడా పెళ్లిని వదిలేసి ఆసుపత్రికి వచ్చి రక్తం ఇచ్చి చిన్నారిని కాపాడినందుకు మీకు చేతులెత్తి నమస్కరించాలి అని చెబుతున్నారు.