ఒక్కోసారి ఆలోచన లేకుండా చేసే తప్పులకు ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అన్న విషయం ఈ తాజా ఉందంతం ద్వారా తెలుసుకోవచ్చు.చక్కగా నిండు నూరేళ్లు జంటగా బతకాల్సిన దంపతులు ఒక పూజారి చేసిన వికృత చర్యల వల్ల ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక లోని రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా లో చోటుచేసుకుంది.
చెన్నపట్టణ తాలూకా సాదారహళ్లి గ్రామంలో లోకేష్(30),కౌశల్య(22) దంపతులు నివసిస్తున్నారు.వీరింటి పక్కనే మారమ్మ దేవాలయం లో ఉన్న పూజారి త్యాగరాజ్ కౌసల్యకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.
దీనితో ఇద్దరూ కలిసి కొద్దీ రోజుల పాటు బెంగుళూరు పారి పోయి సహజీవనం కూడా చేశారు.అయితే తన ప్రవర్తన పై పశ్చత్తాపడిన కౌసల్య త్యాగరాజ్ ని వదిలి పెట్టి తిరిగి భర్త దగ్గరకు వచ్చేసింది.
భర్త కూడా కౌసల్య ను ఆదరించడం తో అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో పూజారి తన బుద్దిని చూపించాడు.కౌసల్య తో గతంలో తీసుకున్న కొన్ని అభ్యంతరకర ఫోటోలను తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడం తో ఆ గ్రామంలో వారు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.
దీనితో గ్రామంలో పరువు పోయింది అని భావించిన దంపతులు ఇద్దరూ కూడా ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
దంపతులు ఆత్మహత్యకు కారకుడైన పూజారి పై ఆగ్రహం తో ఊగిపోయిన వారి బంధువులు,గ్రామస్తులు కలిసి పూజారి ఇంటికి నిప్పు పెట్టడం తో ఆలయం బయట ఉన్న కొన్ని వాహనాలు కాలి బూడిద అయ్యాయి.దీనితో అక్కడ పరిస్థితి మరింత అదుపుతప్పడం తో భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
గట్టి పోలీసు బందోబస్తు మధ్య దంపతుల మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.