వైద్యం మాటున ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటల్ లో డాక్టర్స్ చేస్తున్న అరాచకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కష్టం అనుకోని హాస్పిటల్ కి వెళ్ళే వారిని రకరకాల టెస్ట్ లు పేరు చెప్పి నిలువుదోపిడీ చేసేస్తున్నారు.
ఇక విషాదంలో ఉన్న కుటుంబాలని అయితే ఇదే అవకాశం అనే విధంగా టార్గెట్ పెట్టి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.ఓ విధంగా హాస్పిటల్ లో మెడికల్ దందా దారుణంగా సామాన్య ప్రజలని భయపెడుతుంది అని చెప్పాలి.
ఇప్పుడు ఏపీలో ఓ సంఘటన కార్పోరేట్ మెడికల్ దందాని మరో సారి బయట పెట్టింది.
ఏకొల్లు శ్రీనివాసులు అనే వ్యక్తి నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని వడ్డెపుగుంట వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
బైక్తో ఢీకొట్టిన వ్యక్తి వెంటనే అతడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.ముందు చికిత్స కోసం 20 వేలు కట్టి జాయిన్ చేశారు.విషయం తెలుసుకున్న భార్య హుటాహుటిన ఆసుపత్రికి వచ్చింది.వైద్యులు ఆమెతో నీ భర్తకు బ్రెయిన్ డెడ్ అయింది.
ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సూచించారు.మధ్యాహ్నానికే శ్రీనివాసులు మరణించాడని బాడీని తీసుకొని వెళ్ళాలంటే లక్ష కట్టాలని సూచించారు.
ఒక వేళ లక్ష కట్టలేకపోతే అవయవాలను దానం చేస్తే బిల్లు కట్టాల్సిన పని లేదని ఆఫర్ చేసి అవయావాలని బలవంతంగా తీసుకొని వారిని బయటకి పంపించేసారు.ఇప్పుడు ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది.