నోవెల్ కరోనా వైరస్కు చైనాలోని వుహాన్ నగరం కేంద్రబిందువైన విషయం తెలిసిందే.76 రోజుల లాక్డౌన్ తర్వాత ఆ నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తో ఇటీవలే లాక్ డౌన్ ను ఎత్తేసి సాధారణ జీవితం గడుపుతున్నారు.అయితే అక్కడ ఇక కరోనా తుడిచిపెట్టుకుపోయింది అని అనుకుంటున్నా సమయంలో గత రెండు రోజుల నుంచి కొత్త పాజిటివ్ కేసులు బయపటుడుతున్నాయి.దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
నగరంలో కేసులు మరింత పెరగకముందే ఆ నగర అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.వుహాన్ నగరంలో ఉన్న కోటి పది లక్షల మంది జనాభాకు కరోనా పరీక్షలు చేపట్టాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు.
దీని కోసం నగరంలోని అన్ని డివిజన్లకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.పది రోజుల్లో మొత్తం జనాభాకు పరీక్ష చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.రెసిడెన్షియల్ ప్రాంతాలతో పాటు వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పరీక్షలు ముమ్మరం చేయాలని భావిస్తున్నారు.వుహాన్లో ఏప్రిల్ 8వ తేదీన లాక్డౌన్ ఎత్తివేశారు.
లాక్ డౌన్ ఎత్తేసిన నెల రోజుల తరువాత అంటే మే 10, 11 తేదీల్లో కొత్తగా ఆరు కేసులు నమోదు అవ్వడం తో అక్కడి అధికారులు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.క్వారెంటైన్లో ఉన్నవారికి వైరస్ లక్షణాలు బయటపడినాయి.
అది కూడా వారంతా ఒకే అపార్ట్మెంట్ కావడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.