కరోనా వైరస్.ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది.ఇప్పటికి కోటి పదిహేను లక్షలమంది కరోనా వైరస్ భారిన పడ్డారు.5 లక్షలమంది కరోనా వైరస్ బారిన పడ్డారు.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ సంబంధించి ఓ గుడ్ న్యూస్ తెర మీదకు వచ్చింది.
అది ఏంటి అంటే? ఈ నెలలోనే రెమ్డెసివిర్కు తమ జనరిక్ వెర్షన్ ఔషధాన్ని విడుదల చేయనున్నట్టు దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ కీలక విషయాన్ని ప్రకటించింది.ఇప్పటికే దేశీయ డ్రగ్ మేకర్స్ సిప్లా లిమిటెడ్, హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ రెమ్డెసివిర్ జనరిక్ వెర్షన్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంకా ఈ నేపథ్యంలోనే రెమ్డెసివిర్కు తమ జనరిక్ వెర్షన్ ఔషధం అయినా ”డెస్రెం” పేరుతో భారత్ లో విడుదల చేయనున్నాయి.కాగా ‘డెస్రెం’ పేరుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది.
అయితే 100 మిల్లీగ్రాముల యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వెర్షన్ డ్రాగ్ డోస్ కు 4,800 రూపాయిలకు ఇవ్వనున్నారు.ఏది ఏమైనా నెల రోజుల్లో డ్రగ్ రావడం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.