కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న వేళ.ఈ మహమ్మారి వైరస్ విరుగుడు కోసం ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఎక్కడ పూర్తిస్థాయిలో విరుగుడు మాత్రం అందుబాటులోకి రాలేదు.కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఎన్నో పరిశోధనలు జరిగినా.
అవి నిరాశే మిగిల్చాయి .అదే సమయంలో మరోవైపు కరోనా తీవ్రత మాత్రం రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా లెనోవా కు చెందిన ప్రొఫెసర్ బసెట్టి మాటియా చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయాయి.కరోనా వైరస్ కు సంబంధించి ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరికీ కాస్త ఊరట ఇస్తున్నాయి.
మార్చి నెలలో ఎంతో బలంగా ఉన్న కరోనా ప్రస్తుతం క్రమక్రమంగా ఎంతగానో బలహీనపడుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.ఈ వైరస్ వ్యాప్తి చెందిన మొదట్లో వృద్ధులు ఈ మహమ్మారి వైరస్ బారిన పడి మరణించారు.
కానీ ప్రస్తుతం 80, 90 ఏళ్ళ వయసు ఉన్న వృద్ధులు కూడా మహమ్మారి నుంచి కోలుకుంటున్నారని ఆయన తెలిపారు.ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రపంచ మహమ్మారి వైరస్ మరింత బలపడే అవకాశం ఉందని… ఈ క్రమంలో మరణాలు కూడా సంభవించకపోవచ్చు అంటూ పేర్కొన్నారు.
ఇలా విరుగుడు లేకుండానే కరోనా వైరస్ అంతమవుతుంది అంటూ ప్రొఫెసర్ బస్సేట్టి మాటియా.