కొన్ని నెలలకు ముందు అమెరికా వంటి అగ్రరాజ్యంను ఉగ్రవాదం భయపెట్టిన విషయం తెల్సిందే.ఉగ్రవాద దేశాలను పలు దేశాల అధ్యక్షులు బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.
ఎన్నో దేశాల అధ్యక్షులు ఉగ్రవాదంపై పోరాటంకు నడుం భిగించారు.సిరియా వంటి దేశంలో ఉన్న ఉగ్రవాదం ఏ స్థాయిలో ప్రపంచ దేశాలను కన్నీరు పెట్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సిరిమాతో పాటు పలు ఉగ్రవాద దేశాలు కూడా ప్రపంచాన్ని వణికించాయి.
ఇప్పుడు ఉగ్రవాదం కంటే వంద రెట్టు ప్రమాదకరమైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.
కాని ఉగ్రవాద దేశాలు మాత్రం కరోనా వైరస్ కు దూరంగా ఉన్నాయి.సిరియాతో పాటు పలు ఉగ్రవాద దేశాలుగా పేరు పడిపోయిన దేశాలు ఇప్పుడు కరోనా వైరస్కు అంతగా భయపటం లేదు.
ఎందుకంటే అక్కడ ఇతర దేశాలతో పోల్చితే అంత స్పీడ్గా విస్తరణ జరగడం లేదు.కొన్ని ఉగ్రవాద దేశాల్లో అసలు కరోనా వైరస్ అనేది లేకుండా వారు హాయిగా ఉన్నారు.
ఆ దేశాల్లో కరోనా లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.ఇంతకు ఉగ్రవాద దేశాల్లో కరోనా విజృంభన ఎందుకు లేదో తెలిస్తే అవాక్కవుతారు.ఉగ్రవాదం కారణంగా ఆయా దేశాలకు విదేశీయుల రాక చాలా అంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది.
ఎప్పుడు బాంబులు పేళుడు జరిగే దేశాలు అవ్వడం వల్ల జనాలు అక్కడ బయటకు రాకుండా ఉండేందుకు ఎక్కువ చూస్తారు.
అందువల్ల అక్కడ వచ్చినా కూడా ఒక్కరు ఇద్దరితోనే ఆగిపోయింది.మొత్తానికి ఆ దేశాలను ఇప్పుడు ఆ దేశంలో పాతకు పోయిన ఉగ్రవాద కార్యకలాపాలే కాపాడుతున్నాయంటూ సోషల్ మీడియాలో కామెడీ మెసేజ్లు ఫార్వర్డ్ అవుతున్నాయి.