ప్రపంచ దేశాల ప్రజలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా మహమ్మారి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే లక్షల కేసులు, మరణాలు నమోదయ్యాయి.
గతంలో విజృంభించిన వైరస్ లకు భిన్నంగా కరోనా మహమ్మారి ఉధృతి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి కరోనాతో చనిపోగా ఆ వ్యక్తి చనిపోయిన 18 గంటల తరువాత కూడా అతని శరీరంపై వైరస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.దీంతో శాస్త్రవేత్తలు మృతదేహంపై ఒకటి కంటే ఎక్కువ రోజులే కరోనా వైరస్ ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ విషయం గురించి పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉందని చెబుతున్నారు.ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. శవంపై కూడా కరోనా 18 గంటల కంటే ఎక్కువ సమయం ఉంటుందని ప్రూవ్ కావడంతో ప్రజలు మరింత భయాందోళానకు గురవుతున్నారు.శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో వైరస్ యొక్క జాతులు భిన్నంగా ఉన్నట్లు గుర్తించామని చెబుతున్నారు.మరోవైపు పలువురు శాస్త్రవేత్తలు ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాల సమయం పడుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు.
2021 చివరినాటికి లేదా 2022లో సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.కరోనా మహమ్మారి ఒక్కొక్కరిలో ఒక్కో తరహా లక్షణాలు చూపిస్తూ ఉండటం, మరి కొందరిలో లక్షణాలే కనిపించకపోవడంతో ఈ వైరస్ వల్ల ఒక్కొక్కరిలో ఒక్కో తరహా సమస్యలు ఎదురవుతున్నాయి.కొందరు వైద్యులు తరచూ ఆక్సిజన్ లెవెల్స్ ను చెక్క్ చేసుకోవాలని ఆక్సిజన్ లెవెల్స్ 95 శాతం కంటే తగ్గితే పరీక్ష చేయించుకోవాలని తెలుపుతున్నారు.
కరోనా నిర్ధారణ అయితే వైద్యుల సూచనల మేరకే ట్యాబ్లెట్లను వినియోగించాలని ఇష్టానుసారం మందులు తీసుకుంటే సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.