కరోనా వైరస్.ప్రపంచ దేశాలను వణికించే ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో చెప్పలేం.ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనాకు బలి అవ్వం.అయితే మొన్నటివరకు శానిటైజర్లు, మాస్కులు, ఉపయోగించి మనల్ని రక్షించుకుంటున్నాం.అయితే కళ్ల ద్వారాను కరోనా వైరస్ వ్యాపిస్తుందంటే అంటే ఫేస్ షీల్డ్ ఉపయోగిస్తున్నాం.కానీ ఇప్పుడు చివరికి చెవుల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని అంటున్నారు పరిశోధకులు.
చెవి లోపల వెనుక భాగంలో మెత్తని ఎముకతో కూడిన ప్రాంతాన్ని మస్టాయిడ్ అంటారు.కరోనా రోగుల చెవుల్లోని మస్టాయిడ్ ప్రాంతంలో వైరస్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.కరోనాతో మరణించిన రోగుల చెవుల్లోని మస్టాయిడ్ ఏరియాలో కరోనా ఉండటంతో వైద్యులు షాక్ అయ్యారు.అయితే కరోనా తీవ్రత పెరిగిసమయంలో రోగి శరీరం నుండి చెవుల్లోకి ప్రవేశిస్తుందా లేదా బయట నుంచే చెవులు స్వర శరీరంలోకి వస్తుందా అన్న సందేహాలు ఇంకా సందేహాలుగానే ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు.
అయితే చెవి మధ్యలో ఉండే మూడు చిన్న ఎముకలు మనకు శబ్దం వినిపించేలా చేస్తాయ్ అని ఆ ప్రాంతంలోనే కరోనా వైరస్ ఉన్నట్టు ఇప్పుడు పరిశోధనల్లో వెల్లడైంది.ఇప్పటి నుండి ఆసుపత్రులను సందర్శించే రోగులలో వైరస్ వ్యాప్తి పెరగకుండా చూడాలని అందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు హెచ్చరించారు.
కాగా కరోనా వైరస్ తీవ్రత పెరిగి తగ్గిన వారికి వినికిడి సమస్య వచ్చిందని పరిశోధకులు తెలిపారు.