ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ భయంతో వందలాది దేశాలు లాక్ డౌన్ను ప్రకటించాయి.లక్షల కోట్ల రూపాయలు లాస్ అని తెలిసినా కూడా లాక్ డౌన్ను ప్రకటించి మరీ వైరస్తో పోరాడుతున్నాయి.
ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ను ప్రకటించిన విషయం తెల్సిందే.అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
అయినా కూడా కొందరు ఆకతాయిలు అవివేకులు అశ్రద్దపరులు చిల్లర వేశాల కోసం బయటకు వస్తున్నారు.
ఊర్లలో కళ్లు తాగేందుకు చిల్లర వ్యవహారాల కోసం బయటకు వస్తుండటం చూస్తుంటే వారు ఎంత లైట్గా కరోనా విషయంను తీసుకుంటున్నారో అర్థం అవుతుంది.
ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియాలో కరోనా గురించి ఇష్టానుసారంగా పుకార్లు పుట్టిస్తున్నారు.సిల్లీ పుకార్లను కూడా జనాలు నమ్ముతున్నారు.ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాకున్నా కూడా కొందరు పుకార్లనే నిజంగా నమ్మి చాలా నష్టపోతున్నారు.
మొన్నటి వరకు ఒక్క కొడుకు ఉన్న వారు వేప చెట్టుకు నీళ్లు పోస్తే కరోనా రాదు అంటూ ప్రచారం చేశారు.అది ఇంకా కూడా కొందరు పాటిస్తూనే ఉన్నారు.కరోనాకు వేప చెట్టుకు నీళ్లు పోయడం ఏమైనా సబంధం ఉందా.
కరోనా కారణంగా ఇంట్లో ఉండమంటే ఇప్పుడు జనాలు రాత్రికి రాత్రి వేప చెట్టుకు నీళ్లు పోస్తూ వేప చెట్ల వద్ద గుమ్మి గూడారు.
అలాంటి పుకార్లను పుట్టించడం వల్ల ప్రభుత్వాలు కరోనాపై చేస్తున్న యుద్దంకు ఆటంకం ఏర్పడుతుంది.
ప్రజలు ప్రభుత్వాలు సూచించినట్లుగా పూర్తిగా ఇంటికి పరిమితం అయినప్పుడు మాత్రమే ఈ కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడం జరుగుతుంది.
కరోనాకు మందు దొరికింది, అలా చేస్తే కరోనా రాదు, ఇలా ఉంటే కరోనా రాదు అంటూ కొందరు స్వామీజీలు, కొందరు అవగాహణ లేని డాక్టర్లు చెబుతున్న విషయాలు నమ్మవద్దు.కరోనా అనేది స్వీయ నిర్భందంలో ఉన్నప్పుడు మాత్రమే రాదు.ముందస్తు మెడిసిన్స్ అనేవి లేనే లేవు.
కరోనా రాకుండా ఆకు పసరు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.అది కూడా ఏమాత్రం నిజం కాదు.
కరోనాకు దూరంగా ఉండాలి అంటే కరోనా సోనిక వ్యక్తికి దూరంగా ఉండాలి.కరోనా సోకిన వ్యక్తి ఎవరో తెలియదు కనుక ప్రతి ఒక్కరికి దూరంగా ఉండాలి.
అందుకోసం ఇంటికే పరిమితం అవ్వాలి.పిచ్చి పుకార్లు నమ్మి బయటకు రావద్దు.
నెటిన్స్ ఇంకా సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఇలాంటి సమయంలో ఏది పడితే అది షేర్ చేసి కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న యుద్దాలకు ఆటంకం కలిగించవద్దని ప్రతి ఒక్కరికి విజ్జప్తి చేస్తున్నాం.