మొన్న తెలంగాణా మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.దీనితో అప్రమత్తమైన అధికారులు మేయర్ తో సహా ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కూడా కరోనా భయం పట్టుకుంది.ఆయన డ్రైవర్ కు కూడా కరోనా సోకడం తో ఇప్పుడు రాజాసింగ్ కు కూడా కరోనా టెన్షన్ మొదలైంది.
ఆయన డ్రైవర్ కమ్ గన్ మెన్ కు శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది దీనీతో ఆయన కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నాను అంటూ రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉండే వారందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారని ఆయన వెల్లడించారు.
అయితే టెస్ట్ కు సంబందించిన రిపోర్ట్ లు మాత్రం ఇంకా రాలేదని మరో రెండు రోజుల్లో రావొచ్చు అని రాజాసింగ్ తెలిపారు.శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, ఆయుష్ మంత్రాలయ గైడ్ లైన్స్ పాటించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తాను వ్యాయామం చేస్తున్న ఓ వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
తెలంగాణా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం విదితమే.
కరోనా మహమ్మారి నేపథ్యంలో అక్కడి ప్రజలకు సేవలు అందించడం కోసం పలువురు ప్రజా ప్రతినిధులు,పోలీసులు తప్పనిసరిగా ప్రజల మధ్య తిరగాల్సి రావడం తో వారితో పాటు వారికి సేవలు అందించే సిబ్బంది కూడా కరోనా బారిన పడాల్సి పడుతుంది.ఈ క్రమంలోనే మొన్న మేయర్ డ్రైవర్ కు కరోనా సోకగా, ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ డ్రైవర్ కు కూడా కరోనా పాజిటివ్ రావడం కలవరం కలిగిస్తుంది.