నిన్నటివరకు మందకొడిగా ఉన్న కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా పెరిగిపోయి ఏకంగా 40 కి చేరాయి.ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్ధనల ఫలితంగా ఒక్కసారిగా అటు తెలంగాణా ఇటు ఏపీ లో కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
మార్చి 13 నుంచి 20 వ తేదీలలో ఢిల్లీ లో జరిగిన ప్రార్థనలకు భారీ సంఖ్యలో హాజరైనట్లు తెలుస్తుంది.అయితే ఈ ప్రార్థనలకు ఇండోనేషియా నుంచి అలానే ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన వారు కూడా ఉండడం తో చాలా మందిలో ఈ వైరస్ స్ప్రెడ్ అయినట్లు తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు లో కూడా 74 పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో 16 కేసులు ఢిల్లీ నిజాముద్దీన్ సభలకు వెళ్ళివచ్చినవారే కావడం గమనార్హం. ఏపీ లో కూడా నిన్నటివరకు సింగిల్ డిజిట్ మాత్రమే ఉండగా ఒక్కసారిగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోయింది.
మంగళవారం ఒక్కరోజే 17 కేసులు బయటపడడం తో అధికారులు అప్రమత్తమయ్యారు.పక్షం రోజుల కిందట నిజాముద్దీన్ కు వెళ్లిన వారిలో ఇప్పుడు లక్షణాలకు కనిపిస్తున్నాయి.147 శాంపిళ్లను పరీక్షించగా 17 కేసులు పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.కరోనా కేసులు జిల్లాలవారీగా ప్రకాశంలో 11, గుంటూరులో 9, విశాఖలో 6, కృష్ణాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 2, నెల్లూరు, చిత్తూరు, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కటి ఉన్నాయి.
ఇక దేశవ్యాప్తంగా ఈ రోజు మధ్యాహ్నానికి 32 మరణాలు, 1350 కేసులు నమోదయ్యాయి.అయితే ఢిల్లీ వెళ్లి వచ్చిన వీరిని క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించినప్పటికీ వారు ఇళ్లలో ఉండకుండా బయట తిరగడం తో వారి ద్వారా చాలామంది కి వ్వాపించినట్లు అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం వారందరి వివరాలను సేకరించే పనిలో పడ్డారు అధికారులు.