ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఓ వైపు విస్తరిస్తూ పోతుంది.ఇప్పటికే కరోనా పోజిటివ్ కేసులు అన్ని దేశాలలో కలిపి మూడు లక్షలకి చేరువ అయ్యింది.
ఇక చైనా, ఇటలీ దేశాలలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.ఇప్పటికే ఈ సంఖ్య కూడా 13 వేలు దాటిపోయింది.
ఇప్పటికే ఈ కరోనాని నియంత్రించే ప్రయత్నంలో ఎవరికీ వారు దేశంలో అంతర్ఘాతంగా యుద్ధమే చేస్తున్నారు.ఇండియాలో కూడా కరోనా బాధితుల సంఖ్య మూడు వందలు దాటిపోయింది.
దీంతో ప్రభుత్వం ప్రజలని అప్రమత్తం చేసింది.ఇదిలా ఉంటే ఓ వైపు భయం ఉన్న ఇండియన్ ప్రజలలో వెటకారం కూడా అంతే స్థాయిలో ఉంటుందని తాజాగా ఓ వీడియో రుజువు చేస్తుంది.
ఈ కరోనా వైరస్ మనుషుకి సోకకుండా ఉండటానికి మాస్కులు వేస్తున్నాం మరి జంతువులకి సోకితే ఎంటనే అనుమానం చాలా మందికి వచ్చింది.మరో వైపు మనుషులు తమ ఆహారపు అవవసరాల కోసం పెంచుకుంటున్న మేకలకి, గొర్రెలకి కరోనా వస్తుందనే వింత ప్రచారం జరుగుతుంది.
దీంతో ఓ వ్యక్తి కరోనా మేకలకి సోకకుండా ఏకంగా మాస్కులు వేసాడు.దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు టిక్ టాక్ లో వైరల్ అయ్యి సోషల్ మీడియాలోకి వచ్చింది.
వలలాంటి మాస్కులు మేకలకి ఆ వీడియోలో తొడిగారు.ఇందులో కరోనా వైరస్పై హిందీలో సాంగ్ కూడా ప్లే చేశారు.
ఈ వీడియోకి 4లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.