కరోనా మహమ్మారి నేపథ్యంలో గత మూడు నెలలుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ తో వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని కేంద్రం వారిని తమ ఇళ్లకు చేర్చడంకోసం అని లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ వారికోసం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్ల ను కూడా ఏర్పాటు చేసింది.
పని కోసం అని ఇతర ప్రాంతాలకు వచ్చిన కూలీలు పనులు లేక సొంత వూరు వెళ్లే దారిలేక నానా ఇబ్బందులు పడుతుండడం తో కేంద్ర సర్కార్ వారికోసం అని ఈ ఏర్పాటు చేసింది.ఈ రైళ్ల ద్వారా వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలిస్తోంది.
అయితే అలాంటి వలస కూలీలపై జాలి చూపాల్సిన వారు వారిని గేలి చేస్తూ వారిపై బిస్కెట్ లు విసిరిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఓ రైల్వే అధికారి వలస కూలీల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.శ్రామిక్ రైలులో వెళ్తున్న వలస కూలీలపై డీ.కె.దీక్షిత్ అనే రైల్వే అధికారి.బిస్కట్లను విసురుతూ వారిని దుర్భాషలాడాడు.అతని వెంట ఉన్న సిబ్బంది కూడా.
తమ అధికారి పుట్టినరోజు కనుక మీకు వీటిని ఇస్తున్నాడని వలస కూలీలను ఆట పట్టించారు.అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో దర్శనమివ్వడం తో వైరల్ గా మారింది.
వీడియో వైరల్ అవ్వడం తో ఈ విషయం కాస్త రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి కూడా చేరడం తో ఆ అధికారి మరియు అతనితో ఉన్న సిబ్బందిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.