కరోనా వైరస్ నియంత్రించేందుకు దేశంలో గత 40 రోజులుగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే.ఈ లాక్ డౌన్ కారణంగా ఇంటిని వదిలి ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిన ఉద్యోగులు, వలస కూలీలు.
చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు.ఇంకా ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ అయినప్పటికీ సొంతూళ్లకు వచ్చేందుకు శ్రీకాకుళం మత్స్యకారులు ప్రాణాలకు తెగించారు.
లాక్ డౌన్ కారణంగా చెన్నైలో చిక్కుకున్న జాలర్లు సొంత ఊళ్లకు వచ్చేందుకు వెయ్యి కిలో మీటర్లు సాహస పడవ ప్రయాణం చేశారు.చెన్నైలో పాత మర పడవలను కొనుగోలు చేసి అందులోనే ఆహారం, డీజిల్ నింపుకుని నాలుగు రోజులు కంటి మీద కునుకు లేకుండా ప్రయాణించి స్వగ్రామాలు చేరారు.
మధ్యలో అల్పపీడనం, వర్షంలోనూ గుండెల్లో దైర్యం నింపుకుని ముందు సాగి గమ్యం చేరారు.సముద్రాన్ని జయించారు.