ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోజురోజుకు ప్రజల్లో భయాందోళన పాతుకు పోతుంది.ఇదే సమయంలో వైరస్ వెలుగులోకి వచ్చే నెలలు గడుస్తున్నా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో.
సొంతంగా వైరస్ను ఎదుర్కోవడానికి సిద్ధపడి పోయారు ప్రపంచ ప్రజానీకం.ఈ నేపథ్యంలో విరుగుడు కోసం ఎదురు చూడకుండా.
వైరస్ నుంచి తప్పించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చేస్తున్నారు.
అటు నిపుణులు కూడా ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఎలాంటి సమస్యలూ ఉండవు అని సూచిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎలాంటి ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని అయోమయం కూడా ప్రస్తుతం అందరిలో మొదలైంది.అయితే కొన్ని రకాల టీ లు తాగడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
ముఖ్యంగా ఉల్లితో తయారు చేసిన టీ తాగడం వల్ల ఇమ్యూనిటీపవర్ ఎంతగానో పెరుగుతుంది.
అయితే ఉల్లి ద్వారా ఎంతో మేలు జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోని ఉల్లి తో తయారు చేసిన టీ తాగడం వల్ల బాడీలో కమ్యూనిటీ పవర్ పెరగడంతోపాటు… ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కూడా ఎంతగానో ఉపశమనం కలుగుతుంది.అంతేకాకుండా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఎంతో మేలు చేస్తుంది ఉల్లి.