అమెరికాలో కరోనా వైరస్ విజ్రుభిస్తోంది.ఇటలీ, చైనాలని తలదన్నేలా అమెరికా కరోనా విషయంలో దూసుకుపోతోంది.
నిర్లక్ష్యం వలనో, మరేదైనా కారణాల వలనో కానీ అమెరికా ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకునే దిశగా వెళ్తోంది.ఈ క్రమంలోనే అమెరికా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగితోంది.
ఇప్పటికే 1300 లపైగా మరణాలు నమోదు కాగా, లక్షమందికి పైగా కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది.అయితేఒక పక్క కరోనా దెబ్బకి అమెరికా ప్రజలు, అక్కడ ఉన్న వివిధ దేశాల వలసవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతుందో తాజాగా ఓ సర్వే వెల్లడించిన విషయం అమెరికా వాసులని కంగారు పెట్టిస్తోంది.ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ అంచనాల్ ప్రకారం ఈ కోరనా దెబ్బకి అమెరికాలో 1.5కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయట.ఈ విషయాన్ని సదరు సంస్థ తేల్చి చెప్పింది.అంతేకాదు…
అమెరికాలో ఊడిపోనున్న ఉద్యోగాలు అమెరికా అన్ని ప్రవైటు, రిటైల్ ఉద్యోగాలకంటే కూడా పది శాతం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.ఈ ఎఫెక్ట్ కారణంగా భారత్ తో పాటు మిగిలిన దేశాలలో కూడా ఉద్యోగాల పరిస్థితి దారణంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రకటించింది.భారత్ లో లాక్ డౌన్ వలన సుమారు 9 లక్షల కోట్లు భారీ నష్టం కలిగే అవకాశం ఉందని కూడా ఈ సర్వే తెలిపింది.
ఈ సర్వే ఎఫ్ఫెక్ట్ కారణంగా అమెరికాలో ఉంటున్న వలస జీవులు తమ ఉద్యోగాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.