కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అమాయకపు ప్రజలని బలి తీసుకుంది.ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు.ఇక విదేశాలలో ఉన్న ఎన్నారైల పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది.
కరోనా సోకిన తరువాత సరైన వైద్యం అందక మృతి చెందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.మరి కొందరు భారతదేశంలో తమ కుటుంబాలు ఉన్నా అనాధలుగా విదేశాలలో మృతి చెందారు.
ఇలా కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్యపై కేంద్రం ఆరా తీసింది.
కరోనా కారణంగా వివిధ దేశాలలో మృతి చెందిన ఎన్నారైల సంఖ్య 5286 కి చేరుకుందని ప్రకటించింది.
ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్ ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఫిబ్రవరి నెలలో తీవ్రంగా విజ్రుమ్భించింది. ఫిబ్రవరి 1 నుండీ ఆగస్టు మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5286 మంది ఎన్నారైలు మృతి చెందారని మురళీధరన్ ప్రకటించారు.ఇందులో 2360 మంది కేవలం సౌదీ అరేబియా దేశంలో మరణించారని తెలిపారు.
యూఏఈ లో సుమారు 1441 మంది మృతి చెందగా కువైట్ లో 694 మంది మృతి చెందారు.ఒమన్ లో సుమారు 336 మంది మృతి చెందారు.ఖతర్ లో 238 మంది మృతి చెందారు, బహ్రెయిన్ లో 176 మంది మృతి చెందినట్టుగా తెలిపారు.ఇక కరోనా సృష్టికర్త దేశం చైనాలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, జపాన్ లో 14 మంది మృతి చెందినట్లుగా మంత్రి ప్రకటించారు.
ఇదిలా ఉంటే సుమారు 6 వేల మందికి పైగా కరోనా సోకిన భారతీయులు ఇరాన్ దేశంలో చిక్కుకున్నారని మంత్రి తెలిపారు.