ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసిన కానీ మరోవైపు కొత్త ఉత్పత్తులకు అవకాశాలను కల్పిస్తుంది.ఇక కరోనా వైరస్ ను అరికట్టేందుకు వ్యాక్సిన్లు తయారు చేసే పనిలో ఫార్మా కంపెనీలు అనేక చర్యలు చేపడుతున్నారు.
ఓవైపు కరోనా వైరస్ ను అరికట్టేందుకు విభిన్నమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో.కొన్ని దిగ్గజ కంపెనీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
కరోనా వచ్చిన తర్వాత బిజినెస్ మోడల్ మొత్తం కూడా మారిపోయిందనే చెప్పాలి.ఇక తాజాగా కరోనాను అరికట్టేందుకు యాంటీవైరల్ దుస్తులు వస్త్ర బ్రాండ్ల మార్కెట్లోకి రావడం జరిగింది.
ఆ దుస్తులు ధరిస్తే కేవలం అరగంటలోనే కరోనా వైరస్ ను చంపేస్తుంది అని తెలపడం చాలా విడ్డూరమే చెప్పాలి.ఈ ఘటన ముంబై నగరానికి చెందిన ఒక ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ అయిన డోనియర్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి తీసుకొని వచ్చారు.
స్విట్జర్లాండ్ కు చెందిన ఒక సంస్థ తో బయోటెక్ బ్రాండ్ కింద యాంటీవైరల్ ఫ్యాబ్రిక్ ని విడుదల చేయడం జరిగింది ఈ కంపెనీ.ఇక ఆ సంస్థ వారు ఈ దుస్తులను ధరిస్తే కేవలం 30 నిమిషాల్లోనే కరోనా వైరస్ ను చంపేస్తుంది అని వారు తెలియజేస్తున్నారు.
అంతేకాదు దానికి సంబంధించిన సర్టిఫికెట్ ను కూడా ఆ సంస్థ అందిస్తోంది.దీని పరిశీలన ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ నగరంలో ఉన్న పీటర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్స్పెక్షన్ అండ్ ఇమ్యూనిటీ పరీక్షలు నిర్వహించిన వారు నిర్వహించిన పరీక్షల్లో 99% ఇది వైరస్ నిరోధించినట్టు నిర్ధారణ జరిగింది.