ఈ వార్త నిజంగానే శుభవార్త అనే చెప్పాలి.ఎందుకంటే అమెరికా సీటిల్ నుంచి ఓ చేపల బోటు ప్రయాణం కొనసాగించగా వారికి కరోనా వైరస్ అసలు సోకలేదట.
ఎందుకంటే వారికీ గతంలోనే కరోనా వైరస్ సోకి రికవరీ అయ్యిందట.ఇంకా దీనిపై అమెరికాలో చిన్నపాటి పరిశోధన జరగగా దానిలో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.
నిజానికి ఇప్పటికే కరోనా వైరస్ సోకినవారి మళ్లీ సోకదు అని తెలిసినప్పటికి అమెరికా పరిశోధకులు చేసిన పరిశోధనతో క్లారిటీ వచ్చింది.కరోనా వైరస్ ఒకసారి సోకినా తర్వాత రికవరీ అయితే వారికీ మళ్ళీ కరోనా వైరస్ సోకదు.
దీనికి కారణం వారిలో ఎక్కువస్థాయిలో కరోనా వైరస్ ని ఎదుర్కొనే యాంటీ బాడీస్ ఉండడమే.
ఈ విషయాన్నీ చైనా కూడా నాలుగు నెలల క్రితం చెప్పింది.
ఎక్కడ కూడా కరోనా వైరస్ రెండొవసారి సోకినా కేసులు లేవు.సీటీల్ నుంచి వెళ్లిన ఓ బోటు 18 రోజులు సముద్రంలో ప్రయాణించింది.
అందులోని 122 మందిలో 104 మందికి కరోనా వైరస్ సోకింది.అందరికీ ఒకే వ్యక్తి నుంచి కరోనా సోకింది.
అయితే 18 మందికి మాత్రం కరోనా సోకలేదు.
అందులో ముగ్గురికి ఆల్రెడీ కరోనా నుంచి కోలుకున్నారు.
మిగితా 15 మంది సోషల్ డిస్టెన్స్, శానిటైజర్, మాస్కు ఉపయోగించినవారు.అందుకే వారికి వ్యాపించలేదు.
అయితే ఆల్రెడీ కరోనా వచ్చిన వారికి మళ్లీ రాదు అనే దానిపై మరింత పెద్ద పరిశోధన చెయ్యాలని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్, మెడిసిన్ క్లినికల్ వైరాలజీ లాబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గ్రెనింజర్ అభిప్రాయపడ్డారు.