అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వద్ద లాయర్గా చేసిన మైఖేల్ కోహెన్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి తో అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతుండడం తో అక్కడ ప్రిజన్స్ బ్యూరీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ట్రంప్తో తమకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్న అశ్లీల చిత్ర నటుడు స్టార్మి డేనియల్స్ మరియు మాజీ ప్లేబాయ్ మోడల్ కరెన్ మెక్డౌగల్లకు కోహెన్ చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు రావడం తో పాటు ఎన్నికల ప్రచార సమయంలో కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు అంటూ వార్తలు రావడం తో 2018 లో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
అయితే ఖైదీల్లో కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన్ను కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
పలు కేసుల్లో దోషిగా తేలిన కోహెన్కు మూడేళ్ల జైలు శిక్ష పడింది.ఎన్నికల ప్రచార వేళ కోహెన్ అవకతవకలకు పాల్పడ్డాడని, ఆ కేసులో అతను అమెరికా కాంగ్రెస్కు తప్పుడు సమాచారం ఇచ్చారు.
దీంతో ఆయన్ను అరెస్టు చేసి న్యూయార్క్లోని ఓటిస్విల్లీ జైలులో బంధించారు. అయితే ఆ జైలులో ఉన్న కొందరు ఖైదీలకు, సిబ్బందికి వైరస్ సోకినట్లు అనుమానాలు రావడం తో హింసాత్మక నేర చరిత్ర లేని వారిని విడుదల చేసేందుకు ప్రిజన్స్ బ్యూరీ అంగీకరించింది.
దీనిలో భాగంగా ట్రంప్ మాజీ లాయర్ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే మూడేళ్ళ జైలు శిక్ష లో భాగంగా ఆయన ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలమే శిక్షను అనుభవించారు.
అయితే మిలిగిన కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయనను జైలు నుంచి విడుదల చేయాలనీ భావిస్తున్నారు.అయితే విడుదలకు ముందు, అతను COVID-19 యొక్క లక్షణాలు లేవని నిర్ధారించడానికి రెండు వారాల నిర్బంధం చేయవలసి ఉంటుందని అధికారులు వెల్లడించారు.