కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజుకు కొన్ని వేల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే లక్నోలోని ఘాజీపూర్లో కరోనా సోకినా 43 మంది కరోనా బాధితుల జాడ కనిపించడం లేదు.కరోనా పరీక్షల సమయంలో ఈ 43 మంది నమూనాల సేకరణ సందర్భాల్లో తమ ఫోన్ నంబర్లు, చిరునామాలను తప్పుగా ఇచ్చారని అధికారులు చెబుతున్నారు.
దీని కారణంగా వారికీ కరోనా పాజిటివ్ వచ్చినది తెలియక బయట తిరిగి అందరికి అంటిస్తారని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.అయితే కరోనా పాజిటివ్ వచ్చన 43 మంది తెలియడం లేదని అదనపు జిల్లా మేజిస్ట్రేట్కు రాసిన లేఖలో ఘాజీపూర్ అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేకే వర్మ తెలిపారు.
కాగా ఇప్పుడు మిస్ అయినా వారు అంత కూడా ఆస్పత్రిలో కానీ, హోమ్ ఐసోలేషన్ లో కానీ లేరని వారి జడ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటై చేసినట్టు డాక్టర్ కేకే వర్మ లేఖలో వెల్లడించారు.కాగా ఘాజీపూర్ జిల్లాలో ప్రస్తుతం 505 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఈ ప్రాంతంలో కరోనా కారణంగా 10మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.కాగా కరోనా పరీక్షా చేయించుకున్న సమయంలో కరెక్ట్ అడ్రెస్సు, ఫోన్ నెంబర్ కరెక్ట్ గా ఇస్తేనే మీకు పోజిటివ్ ఆ లేక నెగటివ్ అని తెలిసేది.