కరోనాపై అవగాహణ తీసుకు వచ్చేందుకు పలువురు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.కొందరు కవితలు చెబుతుంటే మరికొందరు పాటలు పాడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ సమయంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.ఆయన కరోనా క్రైసిస్ ఛారిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
అదే విధంగా జనాల్లో అవగాహణ కల్పించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడతున్నారు.ఈసారి మెగాస్టార్ చిరంజీవి యూట్యూబ్లో ఒక పాటను విడుదల చేశారు.
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరపర్చి పాడిన కరోనా పాటను తాను కూడా పాడాడు చిరంజీవి.ఈ కరోనా పాటను చిరంజీవితో పాటు నాగార్జున ఇంకా మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్లు కూడా పాడారు.వీడియోలో ఈ అయిదుగురు కలిసి ఉండేలా మిక్స్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సమయంలో టాలీవుడ్ స్టార్స్ చేస్తున్న పనిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.ప్రముఖులు పలువురు తమవంతు సాయంగా విరాళాలు ప్రకటించడంతో పాటు ఇలా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో కరోనాపై అవగాహణ కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది నిజంగా అభినందనీయం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.