కరోనా వైరస్.ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తుండటంతో.కరోనా నియంత్రణకై కేంద్ర ప్రభుత్వ 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 14వ తేదీ వరుకు ఏ ఒక్కరు బయటకు రాకూడదు అని.అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలి అని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ కొందరు లాక్డౌన్ను ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్నారు.పోలీసులను ఎదురిస్తున్నారు.పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదు.దీంతో పోలీసులు విసుగు చెందారు.
ఇంకా అయ్యేది కాదు అని లాక్డౌన్ను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన ముఖాలపై స్టాంపులు వేస్తున్నారు.అలానే జమ్ము కశ్మీర్లోని రణ్బీర్ సింగ్ పురా పోలీసులు రహదారులపైకి వచ్చిన కొందరి నుదిటిపై స్టాంపులు వేశారు.
ఆ స్టాంపులు 15 రోజుల పాటు పోవు.కొందరికి ముఖంతో పాటు చేతిపై కూడా ఈ స్టాంపులు వేస్తున్నారు.అయితే ఆ స్టాంపు మీద ఇలా రాసి ఉంది.”ఇతను క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించాడు” అని.అంతేకాదు.ఆ స్టాంప్ పై సంబంధిత పోలీస్ స్టేషన్ పేరు కూడా ఉంది.
దీంతో ఆ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పోలీసులు కూడా ఇలాగే క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికీ బుద్ధి చెప్పాలి అని భావిస్తున్నట్టు సమాచారం.ఏది ఏమైనా ఇది సరికొత్త ఆలోచన కదా!
.