వల గత కొద్ది రోజుల నుండి ఇండియాలో కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర ఇంకా మరికొన్ని చోట్ల వైరస్ భారీ స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర వైద్య బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాయి.
ఇదే తరుణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు కూడా విధిస్తూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా దేశంలో కరోనా వైరస్ లేటెస్ట్ లెక్కలు కొత్తగా నమోదైన కేసులు వివరాలు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
రిలీజ్ అయిన బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య చూసుకుంటే 16,488 కావటంతో ఇండియాలో మొత్తం నమోదైన కరుణ కేసుల సంఖ్య 1,10,79,979 కి చేరింది. ఇందులో 1,07,63,451 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,59,590 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 113 మంది కరోనాతో మృతి చెందటంతో దేశవ్యాప్తంగా కరోనా వలన మరణించిన వారి సంఖ్య 1,56,938కి చేరింది.
.