కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎంత దారుణంగా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 24వేలమందికిపైగా మృతి చెందారు.5లక్షలకుపైగా ఈ కరోనా బారిన పడ్డారు.ఇంకా అలాంటి ఈ కరోనా భారత్ లోకి ప్రవేశించి దేశాన్ని అతలాకుతలం చేసి పడేసింది.
ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ పాపం.
అన్యంపుణ్యం ఎరుగని పసికందుకు సోకింది.వయసుతో సంబంధం లేకుండా వ్యాధి నిరోధ శక్తి ఎవరికి లేకుంటే వారికీ వచ్చేస్తుంది ఈ వైరస్.
ఇంకా ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో 8 నెలల చిన్నారికి ఈ కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.దేశంలోనే కరోనా వైరస్ సోకినా అత్యంత చిన్న వయస్కురాలు ఈ చిన్నారి.
కాగా ఈ చిన్నారి ఇటీవలే సౌదీ అరేబియా నుండి తిరిగి జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు చేరుకున్నట్టు సమాచారం.అయితే ఈ చిన్నారికి కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో పరీక్షా చెయ్యగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.
అంతేకాదు ఈ చిన్నారి అన్న అయినా 7 ఏళ్ళ బాలుడుకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.ఈ రెండు పాజిటివ్ కేసులతో జమ్మూ కాశ్మీర్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 11 కు చేరింది.