కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడువు ఈనెల 14తో ముగియబోతున్న విషయం తెల్సిందే.దేశ ఆర్థిక పరిస్థితి కారణంగా లాక్ డౌన్ను ఎత్తి వేయాలనే నిర్ణయానికి కేంద్ర వచ్చినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాయి.
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ లాక్ డౌన్ కేంద్రం ఎత్తివేసినా కూడా రాష్ట్రంలో కొనసాగిస్తామంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.
తాజాగా ఈ విషయమై ఏపీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
లాక్ డౌన్ పై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఏపీలో కూడా లాక్ డౌన్ను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా పేర్కొన్నాడు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అధికారులు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగితే ఖచ్చితంగా ఏపీలో కూడా లాక్ డౌన్ అము చేయాలని తెలుగు ప్రజలు అంతా కూడా కోరుకుంటున్నారు.కనుక లాక్ డౌన్ ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.