కరోనా మిగులుస్తున్న కన్నీరు అన్నీ ఇన్నీ కావు.ప్రతి ఒక్కరిపై ప్రభావం పడేలా చేసిన ఈ
కరోనా మహమ్మారి
కొందరి జీవితాల్లో జీవితాంతం గుర్తుండి పోయే బాధను నింపేస్తోంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా వెళ్లే పరిస్థితి లేదు.కనీసం మోయడానికి నలుగురు మనుషులు కూడా దొరకని పరిస్థితి.
స్థానికులు అతడు మామూలుగా చనిపోయాడో కరోనాతో చనిపోయాడో అనే భయంతో కనీసం దగ్గరకు కూడా వచ్చే ధైర్యం చేయడం లేదు.ఎంతో మంది మరణం వచ్చినా పర్వాలేదు కాని ఇలాంటి పరిస్థితుల్లో మరణం రావద్దని కోరుకుంటున్నాం అంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
ఈ రెండు వారాల్లో దేశంలో కనిపించిన కొన్ని సంఘటనలు ప్రపంచంలో ఎవరికి రావద్దనిపించేలా ఉన్నాయి.ఈ సమయంలో చనిపోయిన కొందరి అంతిమ సంస్కారాలు కూడా సరిగా చేయలేని పరిస్థితి.ఒకప్పుడు బంధువు చనిపోయాడు అంటే ఎంత దూరంలో ఉన్నా, ఎంత పనిలో ఉన్నా కూడా వెళ్లే వాళ్లు.కాని ఇప్పుడు వెళ్లాలనుకున్నా వెళ్లే పరిస్థితి.చెప్పాలనుకున్నా బంధువులకు చెప్పలేని పరిస్థితి.అత్యంత దారుణమైన పరిస్థితులు కరోనా లాక్ డౌన్ కారణంగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈమద్య కాలంలో మృతి చెందిన కొందరికి అంత్య క్రియలు చేయడం కూడా కుటుంబ సభ్యులకు కష్టం అయ్యింది.ఎంతటి దుర్భర పరిస్థితి వచ్చిందని కుటుంబ సభ్యుడి మృతితో బాధపడుతున్న వారికి రెట్టింపు బాధను ఎవరు రాకపోవడం కలిగించింది.ఇక చివరి చూపును చూసుకోలేక పోయాం అంటూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు దగ్గరి వారు కూడా కన్నీరు మున్నీరు అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా మృతి చెందినా కూడా కరోనా భయంతో కొందరు దూరంగా ఉంటున్నారు.అధికారులు ఇంకా పోలీసులు ఆంక్షల మద్య దహన సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.మృతి చెందిన వ్యక్తి వద్దకు పదిమంది కంటే ఎక్కువగా వస్తే లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఇంతటి విపత్కర పరిస్థితులు ప్రపంచంలో ఏ దేశంలో రాకూడదు.చివరకు మన శత్రువులకు ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.