భార్యకు వైరస్ సోకిందని భర్త పరార్.. చివరికి ?

కరోనా వైరస్.మనిషిలో మానవత్వాన్ని చంపేసింది.

 Corona Virus, Covid-19, Karnataka, Bengaluru,-TeluguStop.com

పక్కన మనిషి చచ్చిపోతాడు అన్న సరే పట్టించుకోని స్థితికి మనుషులు వచ్చేశారు.మనం ఇన్నాళ్లు ఇలాంటి ఘటనలు చూశాం.

ఇప్పుడు మరో విధమైన ఘటనలను చూస్తున్నాం.ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.కరోనా వైరస్ వచ్చిందంటే అమ్మని ఇంట్లోకి రానివ్వని కొడుకును.భార్యకు కరోనా అంటే ఇంటి నుండి పారిపోయే భర్తను చూసే ఘటనలు వచ్చేశాయ్.

ఇలాంటి దారుణం ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కర్ణాటక రాజధాని అయినా బెంగుళూరులో గౌరి, మంజునాథ్‌ అనే దంపతులు ఉంటున్నారు.ఉత్తర కర్ణాటకకు చెందిన వారు రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఉపాధి కోసం బెంగుళూరు వచ్చారు.భర్త కారు డ్రైవర్ గా పని చెయ్యగా గౌరీ షాపింగ్ మాల్ లో పని చేస్తున్నారు.

అయితే బుధవారం ఆమెకు జ్వరం రావడంతో ఆమెకు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడంతో పాటు కరోనా టెస్ట్ కూడా చూపించగా ఆమెకు పాజిటివ్ అని తేలింది.దీంతో భార్యను హోమ్ క్వారంటైన్ లో ఉంచి మంజునాథ్ అక్కడి నుండి పరారయ్యాడు.

ఇంట్లో తనని చూసుకునే వారు ఎవరు లేక ఇబ్బందులకు గురయ్యింది.అదే రోజు సాయింత్రం శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి ప్రాణాలు కోల్పోయింది.

శనివారం ఇంటి ఓనర్ ఆమెను గమనించి స్థానిక కార్పొరేటర్ శివరాజ్ కు సమాచారం ఇచ్చారు.ఆమె భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చెయ్యడం లేదని, కొద్దిసేపటికి స్విచ్ ఆఫ్ అవ్వడంతో కావాలనే ఇలా చేశాడు అని అర్థం అయ్యి ఆమె పుట్టింటికి ఫోన్ చెయ్యగా ప్రేమ పెళ్లి చేసుకున్న రోజే ఆమెతో బంధం తెగిపోయిందని చెప్పారు.

దీంతో ఆమె మృతుదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.ఆమె భర్తపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube