కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి.
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా అగ్ర రాజ్యాన్ని సైతం వణికించేసింది.ఇంకా వైరస్ ని నియంత్రించేందుకు పరిశోధకులు విశ్వా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ఏడాది చివరికి కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి కోటి 80 లక్షలమందికిపైగా కరోనా వైరస్ వ్యాపించింది.
అయితే కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అంతే వేగంగా కరోనా నుండి కోలుకుంటున్నారు కూడా.ఇప్పటికి 11,340,879 మంది కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకున్నారు.
ఇంకా 689,164 మంది కరోనా వైరస్ కు బలయ్యారు.
అయితే కరోనా కేసుల్లో 4,764,588 కేసులతో మొదటి స్థానంలో అమెరికా ఉండగా 2,708,876 కరోనా కేసులతో బ్రెజిల్ రెండొవ స్థానంలో నిలిచింది.1,756,220 కరోనా కేసులతో మూడోవ స్థానంలో భారత్ నిలిచింది.కాగా భారత్ లో గత 24 గంటల్లో ఏకంగా 50 వేల మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు.
ఇప్పటివరకు భారత్ 37వేల మందికిపైగా కరోనా వైరస్ కు బలవ్వగా, 11 లక్షలమందికిపైగా కరోనా నుండి కోలుకున్నారు.