ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎలా వణికించింది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ భారిన ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్లమంది పడ్డారు.
అందులో కోటిమందికిపైగా కరోనా నుండి కోలుకోగా 7 లక్షలమంది కరోనా వైరస్ కు బలయ్యారు.
ఇంకా అలాంటి కరోనా వైరస్ కోసం యాంటీవైరల్ డ్రగ్ ఫవిపిరవిర్ వెర్షన్ వచ్చేసింది.
ఈ డ్రగ్ ను ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ లాంచ్ చేసింది.కరోనా నివారణకు ప్రయోగాత్మక డ్రగ్ గా చెప్తున్నా ఈ ఫవిపిరవిర్ ఔషధం అతి తక్కువ ధారణే అందించనున్నారు.
కోవిహాల్ట్ పేరుతో ఈ టాబ్లెట్ ను అందుబాటులోకి తీసుకోవచ్చారు.
సిప్లా లిమిటెడ్, సన్ ఫార్మా, హెటెరో ల్యాబ్స్తో సహా జనరిక్ ఔషధ కంపెనీ ఫావిపిరవిర్ అభివృద్ధి చేసింది.
అయితే లుపిన్ వెర్షన్, కోవిహాల్ట్ 10 టాబ్లెట్ల స్ట్రిప్ రూపంలో లభిస్తుంది.ఇంకా ఒక్క టాబ్లెట్ ధర 49 రూపాయిల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.కాగా సన్ ఫార్మా మొన్న మంగళవారం తన సొంత వెర్షన్ టాబ్లెట్ ను కేవలం రూ .35 లకే విడుదల చేసింది.భారతదేశంలో ఇప్పటివరకు అతి తక్కువ ధరకే లభించే యాంటీ వైరల్ డ్రగ్ ఇదే.