కరోనా వచ్చి ఉండకుంటే అనుష్క ఏం చేసేదో తెలుసా..!

అనుష్క హీరోయిన్‌ గా రూపొందిన నిశబ్దం సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భాగమతి సినిమా తర్వాత దాదాపుగా రెండున్నర ఏళ్ల గ్యాప్‌ ఈసుకున్న ఈ అమ్మడు ఎట్టకేలకు ఈ సినిమాతో రాబోతుంది.

 Corona Virus Changed Anushka Planes , Coronavirus, Anushkha, Nishabddam, Lock Do-TeluguStop.com

బాహుబలి సినిమా తర్వాత ఏడాది గ్యాప్‌ తీసుకుని భాగమతి సినిమాతో వచ్చింది.కాని నిశబ్దం సినిమాకు మాత్రం రెండున్నర ఏళ్లు పట్టడంపై ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరీ ఇంత గ్యాప్‌ ఏంటీ స్వీటీ అంటూ ఆమెను సున్నితంగా మందలిస్తున్నారు.ఈ సమయంలో అనుష్క తన గ్యాప్‌ విషయమై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కరోనా వల్ల తన ప్లాన్‌ అంతా మారిపోయిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

నిశబ్దం ప్రమోషన్‌ లో భాగంగా అనుష్క మాట్లాడుతూ తనకు నిశబ్దం సినిమా వల్ల అనుకోకుండా గ్యాప్‌ వచ్చింది.

గత ఏడాదిలోనే కొత్త సినిమా మొదలు పెట్టాలనుకున్నాను.కాని నిశబ్దం సినిమా ఆలస్యం అవ్వడం వల్ల కొత్త సినిమాను చేయలేక పోయాను.

ఈ ఏడాది ఆరంభంలో నిశబ్దం విడుదల అయితే అప్పుడు కొత్త సినిమాను మొదలు పెట్టాలనుకున్నాను.కాని అప్పుడు కూడా నిశబ్దం సినిమా విడుదల అవ్వలేదు.

సమ్మర్‌ లో ఖచ్చితంగా కొత్త సినిమాను ప్రారంభించి ఇదే ఏడాదిలో విడుదల చేయాలని అనుకున్నాను.కాని కరోనా వల్ల నా ప్లాన్‌ రివర్స్‌ అయ్యింది.

కరోనా లాక్‌ డౌన్‌ వచ్చి ఉండకుంటే ఖచ్చితంగా సినిమాను మొదలు పెట్టేదాన్ని కాని సాధ్యం కాలేదు, అందుకే అతి త్వరలోనే సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.ఈ ఏడాది చివర్లో సినిమాను మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా అనుష్క పేర్కొంది.

వచ్చే ఏడాదిలో అనుష్క రెండు సినిమాలతో వచ్చే అవకాశాలున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube