కరోనా నుండి ప్రజలకు స్వేచ్చ లభించిందని ఆనందిస్తున్న సమయంలో ఇన్నాళ్లూగా దాచుకున్న కరోనా మళ్లీ పంజా విసరడం మొదలు పెట్టింది.కోవిడ్ టీకా వచ్చినా కరోనా ఇంకా భయపెడుతూనే ఉంది.
ఇప్పటికే కొన్ని రాష్ట్రల్లో ఈ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది.ముఖ్యంగా ఈ ఐదు రాష్ట్రాల్లో మాత్రం మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
అవి ఏంటంటే.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, పంజాబ్, కేరళ, రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసులు మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.ఈ రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించొద్దని ప్రజలకు సూచించింది.
ఇక దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటం భయాందోళనలను పెంచుతోంది.
ఇకపోతే మహారాష్ట్ర, కేరళలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, ఈనెల 13 నుంచి మధ్యప్రదేశ్ లో కూడా కొత్త కేసులు నమోదు అవుతున్నాయని వెల్లడించింది.ఈ పరిస్దితి ఇలాగే కొనసాగితే దేశంలో మళ్లీ లాక్డౌన్ మొదలవ్వ వచ్చనే అనుమానాన్ని వెల్లడిస్తుంది.
కాబట్టి ప్రజలందరు విధిగా కరోనా నిబంధనలను పాటించాలని తెలియచేస్తుంది.