జగన్ ఆ పిలుపు ఎందుకు ఇవ్వలేక పోతున్నారు ?

ఏపీ

లో లో

కరోనా వైరస్

ప్రభావం ఉన్నా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితి కాస్త అదుపులో ఉన్నట్టుగానే కనిపిస్తోంది.ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ప్రజలు ఎవరికీ ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాయి.

 Why Jagan Silent In Ap Cm Relief Fund Issue, Corona Virus, Ap Cm Jagan Mohan Red-TeluguStop.com

ప్రజలకు కరోనా వైరస్ కు సంబంధించిన జాగ్రత్తలు చెప్పడంలో కేవలం కొద్దిమంది మాత్రమే ముందుకు వస్తూ ఉండడం, మిగతా నాయకులంతా ఇళ్లకే పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది.కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తోంది.

ఈ పరిస్థితుల్లో ఈ వైరస్ ను అడ్డుకునేందుకు భారీగా నిధులు అవసరం ఏపీకి ఉంది.విభజన కష్టాలు, ప్రభుత్వ పథకాలతో ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఈ సమస్య ఉండడంతో అన్ని రాష్ట్రాలకు నిధులను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి కేంద్రానికి ఉంది.

-Political

అందరితో పాటు సమానంగానే ఏపీకి నిధులు కేటాయించే అవకాశం ఉంది.కానీ అవి ఒక మూలకు రావన్న సంగతి అందరికీ తెలుసు.ఈ నేపథ్యంలో ఏపీని కాపాడుకునేందుకు జగన్ విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిస్తే ఏపీ సీఎం సహాయనిధి కి కోట్లాది రూపాయలు వచ్చిపడతాయి.

ఎందుకంటే జగన్ ను అభిమానించే వారు, ఆయన మాట జవదాటని వారు లక్షలాది మంది ఉన్నారు.వారిలో అపర కుబేరులు, సినీ ప్రముఖులు ఇలా చాలామంది ఉన్నారు.

వైసిపి

అంటే అభిమానం ఉంది.ఏపీకి సహాయపడాలి అంటూ వివిధ రంగాల్లో సెటిలైన ప్రముఖులకు జగన్ పిలుపునిస్తే పరిస్థితి మెరుగు పడుతుంది.

ప్రస్తుతానికి ఖజానాకు ఇబ్బంది లేదు అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నా, ముందు ముందు మాత్రం కరోనా ప్రభావం ఏపీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదు.

ఈ నేపథ్యంలోనే

విరాళాల సేకరణ

కోసం

జగన్

మొహమాటం పక్కన పెట్టి ముందుకు దూకితే ఫలితం ఉంటుంది.

ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ అడిగితే ఇచ్చే వారి సంఖ్య వేలల్లో, లక్షల్లో ఉంటుంది.అయితే జగన్ మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు.

ఇప్పటికే చాలా రాష్ట్రాలు సహాయం కోసం బహిరంగంగా విరాళాలు సేకరిస్తున్న యి.కానీ ఏపీలో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

తెలంగాణలో ముందస్తు జాగ్రత్తగా ఉద్యోగుల జీతాల్లో కోతలు

పెట్టేసారు.అయితే ఏపీలో కోతలు ఉండవు అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

ఇప్పటికే ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.అయినా జగన్ మాత్రం విరాళాల సేకరణ కోసం పిలుపు ఇచ్చేందుకు మొహమాటం పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube