కరోనా మహమ్మారి
అమెరికాని వ్యాప్తంగా చేస్తున్న మారణహోమం ఎవరూ ఊహించని రీతిలో జరుగుతోంది.వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదు అవుతుండగా, లక్షల సంఖ్యలో
కరోనా పాజిటివ్
కేసులు నమోదు అవుతున్నాయి.
ఈ క్రమంలో అమెరికాలో కరోనా అత్యంత ప్రభావం చూపుతున్న నగరాలైన
న్యూయార్క్, న్యూజెర్సీ
, పలు ప్రాంతాల ప్రజలు అత్యధికంగా మృతు వాతపడుతునన్నారు.న్యూయార్క్ పై భవిష్యత్తు ఆందోళనలు అందరికి నెలకొన్నాయి.ఇదిలాఉంటే…
న్యూయార్క్ లో కరోనా బాధితులకి సేవలు అందిస్తున్న నర్సులు నిరసనలు వినిపిస్తున్నారు.కరోనా వ్యాపిస్తున్న సమయంలో వారికి వ్యక్తిగత రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని నిరసనలు తెలుపుతున్నారు.
యూజ్ అండ్ త్రో వంటి పరికరాలని ఎక్కువగా వాడమని చెప్పడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.వాటినే వాడలంటూ మాపై ఒత్తిడి తెస్తున్నారని మేము మనుషులమే కదా అంటూ మండిపడుతున్నారు.
లాభాల కంటే రోగులే ప్రధానం అంటూ ఫ్లకార్డులు పట్టుకుని మరీ తమ నిరసనలు తెలిపుతున్నారు.ఇప్పటికే మా సహచరులు ఇద్దరు
ఐసీయూ
లో ఉన్నారని అలా వారిని చూసిన తరువాత మాకు వ్యక్తిగత ఆందోళన పెరుగుతోందని వాపోతున్నారు.ఈ విషయంపై స్పందించిన న్యూయార్క్ మేయర్ అందరికి అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని అబద్దాలు చెప్పారని మా నిరసన ఇలాగే కొనసాగుతుందని ప్రకటించారు.