కరోనా కల్లోలం దేశాన్ని అతలకుతలం చేస్తోంది.సామాన్య ప్రజల నుంచి అన్ని శాఖల అధికారులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.
దీంతో విధులు నిర్వహించాలంటే జంకుతున్నారు అధికారులు.ఇప్పటికే ఉన్నతా స్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు కరోనా దాటికి గురయ్యారు.
ముఖ్యంగా కరోనా కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్నా పోలీసు, వైద్యా, ఆరోగ్య, మున్సిపల్ శాఖలలో ఈ తాకిడి ఎక్కువ ఉంది.తాజాగా ఈ జాబితాలో ఎయిర్ ఇండియా ఉద్యోగులు కూడా చేరారు.
వందేభారత్ మిషన్లో పాల్గొన్న ఎయిర్ ఇండియా సిబ్బందిలో 60 మంది పైలెట్లకు కరోనా సోకింది
కరోనా సంక్షోభ సమయంలో పలు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ‘వందే భారత్ మిషన్’ కింద స్వదేశానికి కేంద్ర ప్రభుత్వం తరలిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎయిర్ ఇండియా విమానాల్లో పనిచేసే 60 మంది పైలెట్లకు కరోనా సోకిందని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలెట్స్ కమిటీ వెల్లడించింది.
ఈ మేరకు ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలెట్స్ కమిటీ కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరికి కమిటీ లేఖ రాసింది. 137 దేశాల నుంచి 5,05,990 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చామని, కరోనా సంక్షోభ సమయంలోనూ సేవలందిస్తున్నందున తమ సమస్యలను పరిష్కరించాలని పైలెట్ల సంఘం మంత్రిని కోరింది.
ప్రాణాలకు తెగించి కరోనా కష్ట కాలంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన పైలెట్లకు జీతాలు కోత పెట్టడం సమంజసం కాదని ఎయిర్ ఇండియా పైలెట్లు లేఖలో పేర్కోన్నారు.జీతాల్లో కోత పెట్టడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని పైలెట్లు చెప్పారు.