మహమ్మారి కరోనా వైరస్ ఎవరిని విడిచి పెట్టడం లేదు.తగ్గిపోయినట్లు కనిపించి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా ని కంట్రోల్ చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి చూస్తే మళ్లీ లాక్ డౌన్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో వైరస్ కేసులు ఎక్కువ వస్తున్న చోట్ల లాక్ డౌన్ చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో వచ్చిన గాని చాలా మంది సెలబ్రెటీలు మరియు సామాన్యులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు.
నిన్న బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద హీరో అమీర్ ఖాన్ కరోనా బారిన పడగా తాజాగా హీరో మాధవన్ కి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశారు.ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్ పెట్టారు.
గతంలో వీరిద్దరూ కలిసి హిందీలో త్రీ ఇడియట్స్ అనే సినిమాలో నటించడం జరిగింది.ఆ సినిమాలోని పేర్లు ప్రస్తావిస్తూ కామెంట్లు పెట్టారు.మా ఇద్దరిని వైరస్ ఫాలో అవుతుంది అంటూ కామెడీ తరహాలో పోస్ట్ పెట్టారు.త్రీ ఇడియట్స్ సినిమా లో.అమీర్ ఖాన్ ని ప్రతి విషయంలో మాధవన్ ఫాలో అవుతూ ఉంటాడు.ఈ తరుణంలో ప్రస్తుతం ఇద్దరిని వైరస్ ఫాలో అవుతుంది అన్నట్టు మాధవన్ కామెంట్ పెట్టారు.