గత సంవత్సరం భారత్ను చూసి చాలా నేర్చుకోవాలి అని అనుకున్నాయి విదేశాలు.కానీ ప్రస్తుత పరిస్దితుల్లో భారత్ కూడా ఆరోగ్య పరంగా మనలాంటి దేశమే అని అనుకుంటున్నాయట.
ఫస్ట్ వేవ్లో ఎలాగైతే కోవిడ్ తుఫాన్ బారిన పడిన దేశాలు తీవ్రంగా అల్లాడాయో ప్రస్తుతం మనదేశం కూడా సెకండ్ వేవ్ తీవ్రతకు వణికిపోతుంది.
ఈ క్రమంలో ఇప్పటికే విదేశాలకు వెళ్లే భారత్ ప్రయాణికుల పై పలు దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
అంతే కాకుండా కొన్ని దేశాలైతే భారత్ ప్రయాణికులను నిషేదించాయి కూడా దీనికి కారణం భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతుండటం.
ఇకపోతే తాజాగా భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులను తమ దేశంలోకి అనుమతించబోమని జర్మనీ విదేశాంగ మంత్రి హెయికో మాస్ తెలిపారు.
అంతే కాకుండా ఇటలీ కూడా భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై నిషేదం విధించింది.
కాగా ఇటలీకి చెందిన వారు ఇండియా నుంచి స్వదేశంలోకి రావడానికి అనుమతిస్తున్నట్టు తెలిపారు.అయితే వారికి నెగటివ్ రిపోర్టు తప్పని సరి అని ఇటలీ ఆరోగ్య శాఖ మంత్రి రొబెర్టో స్పెరాన్జా వెల్లడించారు.
మొత్తానికి భారత దేశ ప్రయాణికులకు ఒక్కో దేశం షాకివ్వడం మొదలుపెట్టిందని అర్ధం అవుతుంది.
కానీ మనో ధైర్యాన్ని, సహాయ సహకారాలను మాత్రం అందించడానికి పలు దేశాలు ముందుకు వస్తున్నాయి.