దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి.పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కరోనా వ్యాక్సిన్ అభివృద్ధితో పురోగతి సాధించింది.
అయితే తాజాగా వ్యాక్సిన్ పంపిణీపై సంస్థ కీలక నిర్ణయాలను తీసుకుంది.
కరోనా వ్యాక్సిన్ ను ప్రైవేట్ ఎంటీటీస్ కు ఇవ్వడం కంటే ప్రభుత్వ నెట్ వర్క్ ద్వారా పంపిణీ చేయడమే మేలని భావించింది.
అయితే పూణేలో తాను ఉంటున్న పార్శీ కమ్మూనిటీకి మించి భారీ మొత్తంలో కరోనా వ్యాక్సిన్లు తయారీ చేశామని సీరం సీఈఓ అదర్ పూనవల్లా ట్వీటర్ లో పేర్కొన్నాడు.కాగా, సీరం ఇనిస్టిట్యూట్ కు ప్రపంచంలో పలు వ్యాధులకు వ్యాక్సిన్లు అందించిన ఘనత ఉంది.
ఇదిలా ఉండగా ఇద్దరు పార్శీల మధ్య జరిగిన సాధారణ సంభాషణ ఇలా ఉంది.‘‘ కరోనాకు ఒక్కసారి వ్యాక్సిన్ డెవలప్ మెంట్ పూర్తయితే అందరికీ అందుబాటులోకి వస్తుంది.
ప్రస్తుతం దీని మాట్లాడటం తొందరపాటే అయిన ముందుచూపును కలిగి ఉండాలి.వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తర్వాత పంపిణీని ప్రైవేట్ రంగం చేతిలో పెడితే అది సామాన్యుల చేతికి చేరే వరకు ప్రజల ప్రాణాలే పోవచ్చు.
అధిక ధరకు కొందరూ కొనకపోవచ్చు.ప్రైవేట్ సంస్థలు చేతిలో పెట్టడం కన్నా ప్రభుత్వమే డిస్ట్రిబుట్ చేస్తే ప్రజలందరికీ వ్యాక్సిన్ చేరుతుంది.
వ్యాక్సిన్ నేరుగా కొనాల్సిన దుస్థితి ఏర్పడదు.’’ అని ఎస్ఐఐ లిఖిత పూర్వక ప్రకటనను వెల్లడించింది.