ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు సరైన వ్యాక్సిన్ రాక మరింత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.దీంతో కేంద్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కొనుగోళ్లకు ముందుకు రాగా….
సరైన నిల్వ ప్రక్రియ, సరైన అందుబాటు ధర కు లేనందున నిరాకరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఫైజర్ కంపెనీ నుండి వస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ను కొనుకునే ఆలోచన లేదు.కారణం ఈ వ్యాక్సిన్ లో కేవలం ఒక్క డోసుకు రూ.2,700(37 డాలర్లు) ధర ఎక్కువగా ఉండటంతో నిరాకరించారు.అంతేకాకుండా ఆ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ చల్లని ఉష్ణోగ్రత లో ఉంచేందుకు సరైన వసతులు లేక పోయేసరికి ఆ వ్యాక్సిన్ ను కొనలేకపోయారు. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న వ్యాక్సిన్ ను తీసుకోవడానికై భారత్ కొన్ని అవకాశాలు ఉన్నాయని తెలుపుతున్నారు.కాగా అది ఒక్క డోసు కు రూ.221 మాత్రమే అందగా దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఫైజర్ వ్యాక్సిన్ కంటే తక్కువ రేటుకు వస్తున్నా వ్యాక్సిన్ కొనుగోళ్లకు ఎక్కువ అవకాశం ఉందని, పైగా దాన్ని నిలువ కూడా తక్కువ మోతాదులో ఉష్ణోగ్రత ఉండటంతో కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.అంతేకాకుండా భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా నుండి వస్తున్న వ్యాక్సిన్ లు వాటి ధర, నిల్వ ప్రక్రియ తక్కువ ఉంటుందని అంచనా వేయగా దాదాపు ఒక డోసు కు రూ.220 నుంచి 440 మధ్య ఉంటుందని అంచనా వేశారు.
ఇదియే కాకుండా రష్యా వ్యాక్సిన్ కూడా ఒక్క డోస్ కు రూ.735 కంటే ఎక్కువగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.కాగా ఈ కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్ కు రూ.221 ఉండగా… మొదట భారత్ 68 కోట్ల డోసు లను కొనే అవకాశాలున్నాయని పైగా 68 కోట్ల డోసు లకు రూ.13,900 కోట్లు వస్తాయని పరిశోధన సంస్థ అంచనాలతో తెలుపుతున్నారు.అంతేకాకుండా కోటిమందికి వ్యాక్సిన్ సిద్ధం చేయాలంటే కోట్లలోనే వస్తాయని తెలిపారు.
ముందుగా అనారోగ్య వ్యాధుల సమస్య ఉన్న వారికి ఎక్కువ డోసు లను అందివ్వాలని కోరగా… తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం తమిళనాడుకు కూడా ఎక్కువగా డోసు లు అందజేస్తారని తెలిపారు.
ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ను ప్రయోగానికి పరీక్షలు చేయకుండానే కొనుగోలు చేయడానికి భారత్ ఔషధ నియంత్రణ సంస్థ నుండి ఇంతకుముందే ఒప్పందాలు తీసుకుంది.కానీ దీనికి నిరాకరించిన విషయ నిపుణుల కమిటీ ప్రయోగ పరీక్షలు చేయాలని డీసీజీఐ కు కోరింది.
ఇదిలా ఉండగా సింగపూర్ ఫైజల్ ఈ వ్యాక్సిన్ ను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.