ఇటీవల దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రం మే ఫస్ట్ నుండి 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ప్రకటన చేయటం తెలిసిందే.చాలా వరకు దేశంలో కుర్రాళ్ళ వల్ల వైరస్ పెద్ద వాళ్లకు సోకుతుంది అని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు మీడియాలో వచ్చాయి.
కుర్రవాళ్ళ లో రోగనిరోధక శక్తి ఉన్న నేపథ్యంలో.వీళ్ల వల్ల పెద్దలకు పాకుతున్న తరుణంలో ప్రాణాలు పోయే పరిస్థితి దేశంలో ఉండటంతో.
మే ఫస్ట్ నుండి కరోనా వ్యాక్సిన్ 18 ఏళ్ళు నిండిన వారికి కేంద్రం అందిస్తూ ఉంది.
ఇదిలా ఉంటే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఈనెల 24 నుండి ప్రారంభం అవుతున్నట్లు నేషనల్ హైవే అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ ఇటీవల వెల్లడించారు.
CoWin అనే యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లను గతంలో లాగానే ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.అదేవిధంగా వ్యాక్సినేషన్ సెంటర్లు ప్రభుత్వం పెంచటం మాత్రమే కాక ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య కూడా పెంచినట్లు స్పష్టం చేశారు.
.