కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రోగ్రాం జరుగుతుంది.మన దేశంలో 32 కోట్లకు పైగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.
అయితే వ్యాక్సిన్ పై కొందరికి ఇంకా అనుమానాలు, డౌట్లు ఉన్నాయి.వ్యాక్సిన్ కు సంబందించి అనుమానాలు ఏమి వద్దని అధికారులు చెబుతున్నా మళ్లీ అలానే వెనకడుగు వేస్తున్నారు.
ఈ క్రమంలో మధ్యప్రదేష్ లో ఒక విచిత్రమైన కేసు తెర మీదకు వచ్చింది.కరోనా టీకా వేసుకున్న ఓ వ్యక్తికి అనారోగ్యం నయమైంది.
కొన్ని నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయనకు వ్యాక్సిన్ తీసుకోగా వ్యాధి నయమైంది.
మధ్యప్రదేష్ లోని రాజ్ గఢ్ జిల్లాలో అబ్ధుల్ మజీద్ ఖాన్ ఏడు నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు.
ఆ ప్రభావంతో అతడి నోటి మీద పడ్డది.చాలా చోట్ల చికిత్స చేయించినా అతనికి బాగు కాలేదు కానీ కరోనా వ్యాక్సిన్ వేసుకోగానే అరగంటలో పక్షవాతం 75 శాతం వరకు నయమైంది.
అతనికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.అరగంటలో అవయవాల కదలిక ప్రారంభమైందని.
పక్షవాతం కారణంగా మాట్లాడటంలో ఇబ్బంది ఉన్న తనకు ఇప్పుడు సరిగా మాట్లాడుతున్నానని చెప్పాడు. అతను కూడా కరోనా వ్యాక్సిన్ ను అందరు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.