కరోనా విజృంభణను తట్టుకొని ఆర్థిక రంగానికి, ప్రజలకు కొంత మేర నష్టం కలిగినా అనేక విపత్కర పరిస్థితుల నుండి మనం బయటపడ్డాం.కాని కంటికి కనిపించకుండా కబలిస్తున్న మహమ్మారికి చెక్ పెట్టేందుకు అత్యంత శక్తివంతమైన కరోనా టీకా సృష్టించబడింది.
ఈ శుభవార్త కోసం మనం ఎప్పటి నుండో వేచి చూస్తున్నాం.ఎట్టకేలకు ఈ కరోనా టీకా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నేడు ప్రారంభం కానుంది.
నేడు ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆరోగ్య సిబ్బందితో మోడీ మాట్లాడనున్నారు.ఇప్పటికే కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులను ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం అందజేసింది.
నేటి నుండే అన్ని రాష్ట్రాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుండగా తెలంగాణలో గవర్నర్ తమిళిసి సౌందర రాజన్ సమక్షంలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానుంది.ఇప్పటికే అన్ని జిల్లాలో వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ డ్రైవ్ కు సిద్దంగా ఉన్నారు.
నేటి నుండి దశల వారీగా అన్ని వర్గాల ప్రజలకు టీకా అందనుంది.ముఖ్యంగా మైనర్లు, బాలింతలకు టీకా ఇవ్వకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
ఏది ఏమైనా ఇక శుభ పరిణామం అని చెప్పవచ్చు.