దేశంలో కరోనా కలకలం సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు దేశంలో చాలామంది ప్రముఖులు మరియు సామాన్యులు మరణించిన సంగతి తెలిసిందే.
దాదాపు కొద్ది వారాలపాటు దేశంలో రోజుకు ఐదు లక్షలకు దగ్గరలో కొత్త కేసులు నమోదు కాగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చురుగ్గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సమాధానం లో పనిచేసే ఉద్యోగస్తులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.
దీని కోసం నేడు స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.కాగా ప్రస్తుతం మహమ్మారి ప్రభావం చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు మెల్లమెల్లగా పోటెత్తుతున్నారు.
అదే రీతిలో టీటీడీ బోర్డు కూడా కరోనా నిబంధనలను సడలించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది.
.